కరోనా కోరల్లో కృష్ణా జిల్లా..
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కృష్ణా జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కృష్ణా జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు విజయవాడకే పరిమితం కాగా, ఇప్పుడు జిల్లావ్యాప్తంగా వైరస్ విస్తరించడం ఆందోళన కల్గిస్తోంది. గురువారం జిల్లాలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కాగా.. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రజలు బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దీంతో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు తెలిపారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఆరు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కృష్ణలంకలో 3, ఊర్మిళ నగర్ లో 2, వైఎస్సార్ కాలనీలో 2, గొల్లపూడిలో 2, కొత్తపేటలో 3, న్యూ అర్అర్అర్పేటలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని మచిలీపట్నంలో 2, ఉయ్యూరులో 2, ఉతుకురులో 2 కేసులు నమోదయ్యాయి.