డైలమాలో కొరటాల..ఎందుకంటే..?
కొరటాల శివ..టాలీవుడ్ టాప్ డైరెక్టర్. అగ్రహీరోలతో వరసబెట్టి సినిమాలు తీస్తూ..అపజయం అంటూ లేకుండా సెపరేట్ ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఎంతో మంది దర్శకులు కలలు కనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఒడిసిపట్టారు. ప్రస్తుతం ‘ఆచార్య’ పేరుతో చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే వ్యాప్తి తగ్గకపోయినప్పటికి..త్వరలోనే షూటింగ్ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందన్న వార్తలు […]
కొరటాల శివ..టాలీవుడ్ టాప్ డైరెక్టర్. అగ్రహీరోలతో వరసబెట్టి సినిమాలు తీస్తూ..అపజయం అంటూ లేకుండా సెపరేట్ ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఎంతో మంది దర్శకులు కలలు కనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఒడిసిపట్టారు. ప్రస్తుతం ‘ఆచార్య’ పేరుతో చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే వ్యాప్తి తగ్గకపోయినప్పటికి..త్వరలోనే షూటింగ్ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జాన్ మొదటివారం నుంచి మళ్లీ స్టార్..కెమెరా..యాక్షన్ చెప్పబోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మళ్లీ షూటింగ్స్ తిరిగి ప్రారంభించేందుకు మూవీ యూనిట్స్ సిద్దమవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ ను చెక్కుతోన్న జక్కన్న రాజమౌళి ఇప్పటికే అందుకు ప్లానింగ్ సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. షూటింగ్ సింహ భాగం కంప్లీట్ అయినందున..మిగిలిన పార్ట్..తక్కువ మంది క్రూతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, ఆచార్య షూటింగ్ కూడా కుదిరినంత త్వరగా కంప్లీట్ చెయ్యాలని కొరటాల శివ ఒత్తిడి చేస్తున్నాడట. ఇప్పటికే ఈ మూవీపై రెండేళ్లుగా ఇరుక్కుపోయిన ఈ టాప్ డైరెక్టర్.. ఇక ఆలస్యం చేయకుండా సినిమా కంప్లీట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. అయితే మెగాస్టార్ హీరో అవ్వడం..ఇప్పటివరకు ఉన్న హిట్స్ ఇంపాక్ట్ నేపథ్యంలో క్వాలిటీ తగ్గకూడదని భావిస్తున్నాడట. ఇలా రెండు వైపులా ఆలోచిస్తూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారట కొరటాల శివ.