మెగాస్టార్ ‘ఆచార్య’.. ఈ ఏడాది రావడం కష్టమేనట

కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడం వల్ల.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఈ ఏడాది విడుదలవడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చిత్ర బృందం..

మెగాస్టార్ 'ఆచార్య'.. ఈ ఏడాది రావడం కష్టమేనట
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 3:05 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడం వల్ల.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈ ఏడాది విడుదలవడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని సమాచారం. మొదట ‘ఆచార్య’ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనుకోని అవాంతరంలా కరోనా వైరస్ వచ్చి పడింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఇక విడుదల చేయాలనుకున్న తేదీ కాస్తా మారింది. మళ్లీ చిత్రీకరణ మొదలై, అన్ని సర్దుకున్నా చాలా సమయం పట్టొచ్చు. అందుకే పరిస్థితి అదుపులోకి వచ్చిన వెంటనే అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటోంది.

కాగా ‘ఆచార్య’లో మెగాస్టార్.. నక్సలైట్ నుంచి ప్రొఫెసర్‌గా మారిన పాత్రలో నటిస్తున్నారని టాక్. అయితే ఇందులో హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Read More:

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌లోనూ ప్రాణాలు తీసే రసాయనాలెన్నో..

గుడ్‌న్యూస్: ఫేస్‌బుక్‌ నుంచి త్వరలో ఫ్రీ ఇంటర్నెట్