చెర్రీ కోసం కొరటాల మరో నిర్ణయం..!
చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో గురు-శిష్యుల పాత్రల్లో చిరు-చెర్రీ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో చెర్రీ భాగం అవుతుండటంతో అతడి కోసం కొరటాల మరో నిర్ణయం తీసుకున్నారట. ఈ మూవీలో మరో రెండు పాటలను పెట్టాలని కొరటాల భావిస్తున్నారట. ఒకటి డ్యాన్స్ పాట, మరోకటి ఎమోషనల్ పాటను పెట్టాలని కొరటాల అనుకుంటున్నారట. దీనికి సంబంధించి సంగీత దర్శకుడు మణిశర్మతో సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఆచార్యలో చెర్రీ పాత్ర కీలకం కానుండగా.. ఆయన పాత్రకు మరింత హంగులను జోడిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఆచార్యలో చిరు ప్రొఫెసర్, నక్సలైట్ పాత్రల్లో కనిపించనున్నారు. సోనూసూద్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. రెజీనా ప్రత్యేక గీతంలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: షాకింగ్.. ఆ బస్సులో వెళ్లిన వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా..!