చిరంజీవి వల్ల కొరటాల రూ.30 కోట్లు నష్టపోయారా..?
కొరటాల శివ ప్లాప్ అంటూ ఎరుగని డైరెక్టర్. అగ్ర హీరోలతో సినిమాలు తీస్తూ..వాటిలో సామాజిక అంశాలు కూడా జొప్పించే దర్శకుడు. ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ లాంటి హీరోలకు బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇచ్చిన కొరటాల శివ..ఇప్పుడు టాలీవుడ్ లెజెండ్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. కొరటాలకు ముప్పై కోట్ల మేర నష్టం వచ్చిందని..అందుకు రీజన్ మెగాస్టార్ చిరంజీవి అని..అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి విశ్లేశిద్దాం. […]
కొరటాల శివ ప్లాప్ అంటూ ఎరుగని డైరెక్టర్. అగ్ర హీరోలతో సినిమాలు తీస్తూ..వాటిలో సామాజిక అంశాలు కూడా జొప్పించే దర్శకుడు. ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ లాంటి హీరోలకు బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇచ్చిన కొరటాల శివ..ఇప్పుడు టాలీవుడ్ లెజెండ్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. కొరటాలకు ముప్పై కోట్ల మేర నష్టం వచ్చిందని..అందుకు రీజన్ మెగాస్టార్ చిరంజీవి అని..అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి విశ్లేశిద్దాం.
కొరటాల శివ టైమ్ కు బాగా ప్రాముఖ్యత ఇస్తారు. అనుకున్న సమయానికి అన్ని పనులు ముగిసేలా పక్కాగా ప్లాన్ చేస్తారు. సినిమా రిలీజయ్యాక ఎక్కువ టైమ్ తీసుకోకుండా..తదుపరి మూవీ వర్క్ స్టార్ట్ చేసేస్తారు. కొరటాల చివరిసారిగా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఆ చిత్ర హీరో మహేశ్ బాబు ఆ మూవీ తర్వాత ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ రెండు మూవీస్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. కానీ కొరటాల మాత్రం చిరంజీవి కోసం ఒకే స్క్రిప్ట్ను పట్టుకుని ఉన్నాడు.’ సైరా’ మూవీ ఏడాదిపాటు ఆలస్యం అయ్యింది. ఆ గ్యాప్ లో మరో మూవీ చేసే ఛాన్స్ ఉన్నా ఈ డైరెక్టర్ అటు వైపు అడుగులు వెయ్యలేదు. ‘ఆచార్య’ ఏమైనా త్వరగా వస్తుందా అంటే అదీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం కొరటాల కెరీర్ పీక్స్ లో ఉంది. రాజమౌళి తర్వాత తెలుగులో ఆయనే పక్కా పైసా వసూల్ డైరెక్టర్ అన్నది బహిరంగ రహస్యం. ఎంతలేదన్నా..సినిమాకు 15 నుంచి 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చిరూ కోసం ఈ టైమ్ వెయిట్ చేశాడు కాబట్టి.. కొరటాల 30 కోట్ల వరకు భారీ నష్టం జరిగిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.