ఆర్మీ టోపీలతో బరిలోకి దిగిన కోహ్లీ సేన
రాంచి: ధోనీ సొంత గ్రౌండ్ రాంచిలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగుతోంది. అయితే ఇందులో కోహ్లీసేన అందరికీ షాక్ ఇచ్చింది. భారత జట్టు ఆటగాళ్లు ఆర్మీ సిబ్బంది ధరించే టోపీలతో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లకు అందజేశారు. జమ్మూకశ్మీర్ పుల్వామాలో జైషే ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. […]
రాంచి: ధోనీ సొంత గ్రౌండ్ రాంచిలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగుతోంది. అయితే ఇందులో కోహ్లీసేన అందరికీ షాక్ ఇచ్చింది. భారత జట్టు ఆటగాళ్లు ఆర్మీ సిబ్బంది ధరించే టోపీలతో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లకు అందజేశారు.
జమ్మూకశ్మీర్ పుల్వామాలో జైషే ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ భారత జట్టు మైదానంలోకి దిగనుంది. మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.