గంభీర్పై కోహ్లీ ఆగ్రహం
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్పై ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైరయ్యాడు. కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్ గురించి అవగాహన లేనట్టు మాట్లాడుతుంటారని అన్నాడు. ఐపీఎల్ టైటిల్ను ఒక్కసారి కూడా గెలవకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లిని కెప్టెన్గా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ గంభీర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టైటిల్ గెలిచానా లేదా అన్న విషయంపై నన్ను జడ్జ్ చేయడం ఏమాత్రం సరైంది కాదని కోహ్లీ అన్నాడు. ఒక […]
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్పై ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైరయ్యాడు. కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్ గురించి అవగాహన లేనట్టు మాట్లాడుతుంటారని అన్నాడు. ఐపీఎల్ టైటిల్ను ఒక్కసారి కూడా గెలవకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లిని కెప్టెన్గా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ గంభీర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ టైటిల్ గెలిచానా లేదా అన్న విషయంపై నన్ను జడ్జ్ చేయడం ఏమాత్రం సరైంది కాదని కోహ్లీ అన్నాడు. ఒక క్రీడాకారుడి ప్రతిభను అంచనా వేయడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. నాకు సాధ్యమైనంత వరకు గెలవడానికే ప్రయత్నిస్తా. ఐపీఎల్లో కనీసం ఐదు మ్యాచుల వరకు నేను ఆడలేనని కొంతమంది ‘బయటి వ్యక్తులు భావిస్తున్నారు. వాళ్లలాగే ఇంట్లో కూర్చుంటాననుకుంటున్నారేమో అని గంభీర్కి కోహ్లి చురకలు అంటించాడు.