చనిపోయిన మామయ్యకు రానా హాఫ్ సెంచరీ అంకితం
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా ఓపెనర్ నితీశ్ రానా అదరగొట్టాడు. 53 బంతుల్లో 81 రన్స్ చేసి, జట్టు భారీ స్కోరు చేయడంలో మేజర్ పాత్ర పోషించాడు.
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా ఓపెనర్ నితీశ్ రానా అదరగొట్టాడు. 53 బంతుల్లో 81 రన్స్ చేసి, జట్టు భారీ స్కోరు చేసి జట్టు విజయంలో మేజర్ పాత్ర పోషించాడు. అయితే ఈ హాఫ్ సెంచరీని, శుక్రవారం మరణించిన తన మామయ్య సురీందర్కు అంకితమిచ్చాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా.. 42 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నరైన్తో కలిసిన ఓపెనర్ నితీశ్ రానా.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్కు 115 పరుగులు పార్టనర్షిప్ నెలకొల్పారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు కోల్కతా 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
ఇక 195 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. బ్యాట్స్మెన్ తడబడటంతో నిర్ణీత ఓవర్లకు 135/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుస సెంచరీలతో జోరు మీదున్న ధావన్(6) పరుగులకే వెనుదిరగగా, రహానే డకౌట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(47), పంత్(27) ఫర్వాలేదనిపించారు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి(5/12), కమిన్స్(3/17) ఢిల్లీ పతనంతో కీలక పాత్ర పోషించారు.
Also Read :