టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కేకే!
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపి కె.కేశవరావును, లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎం.పి. నామా నాగేశ్వర్ రావు ను, రాజ్యసభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపి కె.కేశవరావును ఎన్నుకున్నారు. లోకసభ, రాజ్యసభలలో […]
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపి కె.కేశవరావును, లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎం.పి. నామా నాగేశ్వర్ రావు ను, రాజ్యసభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపి కె.కేశవరావును ఎన్నుకున్నారు. లోకసభ, రాజ్యసభలలో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.