ఎక్కడా తగ్గని కిమ్.. మరో క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా
గత ఐదు రోజుల్లో తక్కువ శక్తి కలిగిన బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిన ఉత్తరకొరియా.. శుక్రవారం ఉదయం మరో ప్రయోగానికి తెరతీసింది. దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగినట్టు ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది. ఇకపై దక్షిణ కొరియాతో మాటలు లేవంటూ ప్రకటించిన కిమ్.. తన ఆయుధ సంపత్తిని ప్రపంచానికి తెలిసేలా క్షిపణుల్ని ప్రయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రయోగించిన విజయవంతమైందని ఉత్తర కొరియా వెల్లడించింది. అయితే ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ దక్షిణ కొరియా కూడా ఓ […]
గత ఐదు రోజుల్లో తక్కువ శక్తి కలిగిన బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిన ఉత్తరకొరియా.. శుక్రవారం ఉదయం మరో ప్రయోగానికి తెరతీసింది. దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగినట్టు ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది. ఇకపై దక్షిణ కొరియాతో మాటలు లేవంటూ ప్రకటించిన కిమ్.. తన ఆయుధ సంపత్తిని ప్రపంచానికి తెలిసేలా క్షిపణుల్ని ప్రయోగిస్తున్నారు.
శుక్రవారం ఉదయం ప్రయోగించిన విజయవంతమైందని ఉత్తర కొరియా వెల్లడించింది. అయితే ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ దక్షిణ కొరియా కూడా ఓ ప్రకటన చేసింది. తూర్పు సముద్రతీరంలో గుర్తు తెలియని క్షిపణి ప్రయోగాలు జరిగాయని తెలిపింది. గత జూలై 25 నుంచి ఇప్పటివరకు ఐదు ప్రయోగాలు జరిగాయని, సియోల్, వాషింగ్టన్ సంయుక్తంగా జరిపిన సైనిక విన్యాసాలకు వ్యతిరేకిస్తూ కిమ్ నేతృత్వంలో ఈప్రయోగాలు జరుగుతున్నాయని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మూడు పేజీల లేఖను కూడా రాశారు. దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు జరపడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ దీనిపై మాట్లాడుతూ .. స్వల్ప శ్రేణి క్షిపణుల్ని పరీక్షించినందుకు కిమ్ చిన్నపాటి క్షమాపణ కూడా చెప్పారని పేర్కొన్నారు.