అనంత యువతి కిడ్నాప్ సుఖాంతం.. పోలీసుల అదుపులో కానిస్టేబుల్‌

అనంతపురంలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. కిడ్నాప్ కు గురైన జ్యోతిని రక్షించిన పోలీసులు... కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భగీరథ ఆచారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంత యువతి కిడ్నాప్ సుఖాంతం.. పోలీసుల అదుపులో కానిస్టేబుల్‌
Follow us

|

Updated on: Nov 03, 2020 | 7:17 PM

అనంతపురంలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. కిడ్నాప్ కు గురైన జ్యోతిని రక్షించిన పోలీసులు… కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భగీరథ ఆచారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్‌కి చెందిన యువతి(22) అపహరణకు గురైంది. సోమవారం సాయంత్రం యువతి మరో మహిళతో కలసి టైలర్ వద్దకు బయలుదేరిన సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతి కిడ్నాప్ ను సీరియస్ గా తీసుకున్న అనంతపురం జిల్లా పోలీసు ఉన్నతాధికారాలు.. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కారును గుర్తించి సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. దీంతో బనగానపల్లె పోలీసులు తనిఖీలు చేపట్టి కానిస్టేబుల్ భగీరథ ఆచారిని అదుపులోకి తీసుకున్నారు. యువతి జ్యోతిని సురక్షితంగా బనగానపల్లె పీఎస్ కు తరలించారు.

ఇదిలావుంటే, ఆజాద్ నగర్‌ ఆరో రోడ్డుకి చెందిన కార్పెంటర్ జ్యోతి(22)కి అవుకు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన భగీరథ ఆచారితో గతంలో వివాహం నిశ్చయించారు. అయితే ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహం రద్దు చేసుకున్నారు. దీంతో యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లినట్లు సమాచారం.