మహేశ్తో కలిసి కియారా మరో సినిమా…!
ఎవరితో కలిసి తొలి చిత్రంలో నటించిందో మరోసారి అతనితోనే కనిపించనుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ‘భరత్ అనే నేను’లో సూపర్ స్టార్ మహేశ్బాబుకి జోడీగా కనిపించిన కియారా ఇప్పుడు ‘సర్కారువారి పాట’లోనూ ప్రిన్స్ సరసన నటించబోతున్నారట....
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కియారా అద్వానీ… గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘వినయ విధేయ రామ’లో కనిపించి సక్సెస్ను మూటగట్టుకుంది. ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులనే కొట్టేసింది. అయితే ‘వినయ విధేయ రామ’ తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఓ తెలుగు చిత్రంకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎవరితో కలిసి తొలి చిత్రంలో నటించిందో మరోసారి అతనితోనే కనిపించనుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ‘భరత్ అనే నేను’లో సూపర్ స్టార్ మహేశ్బాబుకి జోడీగా కనిపించిన కియారా ఇప్పుడు ‘సర్కారువారి పాట’లోనూ ప్రిన్స్ సరసన నటించబోతున్నారట. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలోని మహేశ్ ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదలైంది. మరి.. మహేశ్.. కియారా జంట మళ్లీ తెర మీద కనబడుతుందని ప్రచారం రావటంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.