నేడు మార్కెట్లోకి కియో కొత్త కారు
ఈరోజు మార్కెట్లోకి కియో మోటార్స్ కొత్త కారును ప్రవేశపెడుతుంది. ‘సెల్టోస్’ అనే కారును నేడు మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. అనంతపురంలోని పెనుగొండలోని ఏర్పడిన కియో మోటార్స్ సంస్థ సంవత్సరానికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. భవిష్యత్తులో ఏడాదికి ఏడు లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి చేరుకోవాలనే లక్ష్యం కూడా ఉంది. ముందుగా ఈ కారును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయాలనుకున్నా.. అనుకోని కారణాలవల్ల జగన్ ఢిల్లీలోనే […]
ఈరోజు మార్కెట్లోకి కియో మోటార్స్ కొత్త కారును ప్రవేశపెడుతుంది. ‘సెల్టోస్’ అనే కారును నేడు మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. అనంతపురంలోని పెనుగొండలోని ఏర్పడిన కియో మోటార్స్ సంస్థ సంవత్సరానికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. భవిష్యత్తులో ఏడాదికి ఏడు లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి చేరుకోవాలనే లక్ష్యం కూడా ఉంది. ముందుగా ఈ కారును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయాలనుకున్నా.. అనుకోని కారణాలవల్ల జగన్ ఢిల్లీలోనే ఉంటారు. దీంతో.. ఏపీ మంత్రుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమంలో.. మంత్రులు మేకపాటి గౌతమ్ కుమార్ రెడ్డి, శంకర నారాయణలతో పాటు మరికొందరు మంత్రులు, కియో మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కుక్ హ్యూన్ షిమ్, వైస్ చైర్మన్తో పలువురు కియో సంస్థ సిబ్బంది పాల్గొననున్నారు.