చెర్రీతో కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్!
మిగిలిన టాప్ హీరోలు వరుస సినిమాలను ప్రకటిస్తుంటే మెగా పవర్స్టార్ రామ్ చరణ్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' తరువాత ఈ నటుడు ఎవరి దర్శకత్వంలో
Ram Charan with Khaidi director: మిగిలిన టాప్ హీరోలు వరుస సినిమాలను ప్రకటిస్తుంటే మెగా పవర్స్టార్ రామ్ చరణ్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఈ నటుడు ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఆ దర్శకుడు, ఈ దర్శకుడు అంటూ పలువురి పేర్లు వినిపించినప్పటికీ, అవన్నీ పుకార్లగానే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజు, చెర్రీని డైరెక్ట్ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారట.
ఇప్పటికే ప్రముఖ మైత్రీ సంస్థ తెలుగు, తమిళ్లో ఓ సినిమాను తీసేలా లోకేష్కి అడ్వాన్స్ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో లోకేష్, చెర్రీని డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారట. లోకేష్ వద్ద పలు కథలు ఉండగా.. వాటిని చెర్రీకి వినిపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే 2021 ద్వితీయార్ధంలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా విజయ్తో మాస్టర్ని తెరకెక్కించిన లోకేష్.. ప్రస్తుతం ఖైదీ సీక్వెల్ని తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారు. దీంతోపాటు కమల్ హాసన్ ప్రొడక్షన్లో రజనీకాంత్ నటించబోయే 169వ చిత్రానికి దర్శకుడిగా లోకేష్ పేరు వినిపిస్తోంది.
Read More: