KGF 2: షాకింగ్ న్యూస్.. ‘కేజీఎఫ్‌ 2’ నుంచి కీలక నటుడు ఔట్..!

బాహుబలి ఫ్రాంచైజీ తరువాత అలాంటి క్రేజ్‌తో తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2. యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ మూవీపై కన్నడతో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

KGF 2: షాకింగ్ న్యూస్.. 'కేజీఎఫ్‌ 2' నుంచి కీలక నటుడు ఔట్..!
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 2:57 PM

బాహుబలి ఫ్రాంచైజీ తరువాత అలాంటి క్రేజ్‌తో తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2. యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ మూవీపై కన్నడతో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్‌ కూడా దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వార్త శాండిల్‌వుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీ నుంచి కీలక నటుడు ఔట్ అయ్యారట. మొదటిభాగంలో జర్నలిస్ట్ కమ్ రైటర్ కమ్ నెరేటర్‌ పాత్రలో కనిపించిన అనంత్ నాగ్‌ను రెండో భాగం కోసం కూడా తీసుకున్నారు.

అయితే తన పాత్రతో అంత సంతృప్తి పొందని అనంత్‌ నాగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో ఆ పాత్రను మరో నటుడితో చేయించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి చెప్పాలంటే కేజీఎఫ్‌లో ఉన్న పవర్‌ఫుల్ పాత్రల్లో అనంత్ నాగ్‌ పాత్ర ఒకటి. ఆ కథను ఆయన చెప్పే విధానం ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు రెండో భాగం నుంచి అనంత్ నాగ్ తప్పుకుంటే.. ఆ పాత్రకు ఏ నటుడు న్యాయం చేయగలరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా యాక్షన్ ఎంటర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ విలన్‌గా కనిపించనున్నారు. రవీనా టాండెన్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ కిరుగందర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది జూలై 30న కేజీఎఫ్‌ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

Read Thi Story Also: ‘కేజీఎఫ్’ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే టీజర్..!