నాని వైరాగ్యమా..? మనస్తాపమా..?
టీడీపీ అధిష్టానం తనకు కేటాయించిన విప్ పదవిపై అసంతృప్తిని వ్యక్తం చేసినఎంపీ కేశినేని నాని.. ఇంకా అలకమానలేదు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ అధిష్టానంపై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆయన ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. అందులో నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే తన నైజమని.. తాను స్వయం శక్తిని నమ్ముకున్న వ్యక్తినని.. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని పేర్కొన్నారు. ఇక నిండు సభలో […]
టీడీపీ అధిష్టానం తనకు కేటాయించిన విప్ పదవిపై అసంతృప్తిని వ్యక్తం చేసినఎంపీ కేశినేని నాని.. ఇంకా అలకమానలేదు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ అధిష్టానంపై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆయన ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. అందులో నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే తన నైజమని.. తాను స్వయం శక్తిని నమ్ముకున్న వ్యక్తినని.. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని పేర్కొన్నారు. ఇక నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టానని.. నిండు సభలో మోదీని నిలదీసిన వ్యక్తిని తానేనని ఆయన అన్నారు. తన రక్తంలో భయం లేదని.. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదని కేశినేని ఉద్వేగంగా ఓ పోస్ట్ చేశారు.
https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/posts/1222133511300846