మహిళపై భర్త, నలుగురు స్నేహితుల లైంగికదాడి

కేరళ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త, నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరువనంతపురం జిల్లా వెటుత్తర బీచ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.

మహిళపై భర్త, నలుగురు స్నేహితుల లైంగికదాడి
Follow us

|

Updated on: Jun 05, 2020 | 5:44 PM

కేరళ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త, నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరువనంతపురం జిల్లా వెటుత్తర బీచ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. సిగరెట్ వాతలు పెడుతూ హింసిస్తూ కిరాతకాన్ని ప్రదర్శించారు దుర్మార్గులు. వెటుత్తరలో 25 ఏళ్ల మహళ, తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటోంది. తాజాగా వెటుత్తర బీచ్ కి సరదా కోసం పిల్లలతో కలిసి దంపతులిద్దరూ వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నేహితుడి ఇంటికి వారిని తీసుకుని వెళ్లాడు భర్త. అక్కడ బాధితురాలి చేత బలవంతంగా మద్యం తాగించారు భర్తతో పాటు అతని స్నేహితులు. ఆపై అతి కిరాతకంగా సిగరెట్ తో వాతలు పెడుతూ కన్న కొడుకు ఎదుటే భర్తతో సహా అతని నలుగురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలతో, స్పృహలేని స్థితిలో రోడ్డుపై పడి ఉన్న బాధితురాలిని ఓ యువకుడు గమనించి ఇంటికి చేర్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. బాధితురాలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.