కేరళలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నిన్న ఒక్క రోజే 5,378 మందికి కరోనా పాటివ్ కేసులు..
కేరళలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా కొత్తగా 5,378 మందికి కరోనా....
కేరళలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా కొత్తగా 5,378 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 5,16,978 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దాంతో ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 64,486గా ఉన్నది. కేరళ ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
శబరిమలలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకుని… నెగెటివ్ సర్టిఫికెట్ తో రావాలని ఆదేశించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాజిటివ్ ఉన్న భక్తులు కొండపైకి రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.