కేరళ విమాన ప్రమాదం, ఢిల్లీకి కో-పైలట్ మృతదేహం తరలింపు
కేరళ విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఢిల్లీకి తరలించారు. కోచ్చి నుంచి ఆయన భౌతికకాయం ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది.
కేరళ విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఢిల్లీకి తరలించారు. కోచ్చి నుంచి ఆయన భౌతికకాయం ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కి చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం అఖిలేష్ మృతదేహాన్ని యూపీలోని ఆయన సొంత ప్రాంతమైన మధురకు తరలించనున్నారు.
తాము చివరిసారి అఖిలేష్ కుమార్ తో రక్షాబంధన్ రోజున వీడియో కాల్ ద్వారా మాట్లాడామని, ఆయన ఈ నెల 15, 16 తేదీల్లో ఇంటికి రావాల్సి ఉందని., కానీ భగవంతుడు మరోలా తలిచాడని ఆయన బావ గద్గద స్వరంతో చెప్పారు. కేరళ విమాన ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అనేకమంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.