కేరళ గోల్డ్ స్కామ్ కేసు..పెద్ద ఎత్తున బంగారం తరలించిన సరిత్…ఎన్ఐఏ
కేరళ గోల్డ్ స్కామ్ కేసు నిందితుడు సరిత్ దేశం బయట నుంచి పెద్దఎత్తున బంగారాన్ని విమానాశ్రయాలు, రేవుల ద్వారా తరలించాడని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) ఎర్నాకుళం కోర్టుకు..
కేరళ గోల్డ్ స్కామ్ కేసు నిందితుడు సరిత్ దేశం బయట నుంచి పెద్దఎత్తున బంగారాన్ని విమానాశ్రయాలు, రేవుల ద్వారా తరలించాడని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) ఎర్నాకుళం కోర్టుకు తెలిపింది. ఇతడిని తమ రిమాండుకు ఇవ్వాలని కోరింది. ఈ స్కామ్ లో కొందరు ఉన్నతాధికారులను, కాన్సులేట్ సిబ్బందిని కూడా ఇంటరాగేట్ చేయవలసి ఉంటుందని, విదేశాల్లో దీంతో ప్రమేయమున్నవారిని సైతం ప్రశ్నించవలసి ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. బంగారం అక్రమ దొంగరవాణా ద్వారా సరిత్ భారీగా లాభాలు ఆర్జించాడని ఎన్ ఐ ఏ అధికారులు కోర్టుకు సమర్పించిన తమ దరఖాస్తులో పేర్కొన్నారు.
ఈ పసిడి దొంగరవాణా వ్యవహారంలో స్వప్న సురేష్, సందీప్ నాయర్ అనే నిందితులను ఈ సంస్థ ఇదివరకే తమ కస్టడీలోకి తీసుకుంది. కేరళలో ఈ ‘ఘటన’ హాట్ టాపిక్ గా మారి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.