నగర శివారులో దారుణం.. ఆశ్రమం ముసుగులో అరాచకాలు.. గొలుసులతో కట్టేసి..

హైదరాబాద్ నగర శివారులోని నాగారం శిల్పానగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం పేరుతో ఓ సంస్థ అక్రమంగా మానసిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకే గదిలో 50 మందికిపైగా వృద్ధులను ఉంచుతూ.. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే విషయాన్ని స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దంతో పోలీసులు పునరావాస కేంద్రంపై దాడి చేశారు. ఆశ్రమంలో ఉన్న బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి […]

నగర శివారులో దారుణం.. ఆశ్రమం ముసుగులో అరాచకాలు.. గొలుసులతో కట్టేసి..
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 7:31 AM

హైదరాబాద్ నగర శివారులోని నాగారం శిల్పానగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం పేరుతో ఓ సంస్థ అక్రమంగా మానసిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకే గదిలో 50 మందికిపైగా వృద్ధులను ఉంచుతూ.. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే విషయాన్ని స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దంతో పోలీసులు పునరావాస కేంద్రంపై దాడి చేశారు. ఆశ్రమంలో ఉన్న బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మానసికంగా బాధపడేవారిని బాగుచేస్తామంటూ.. వృద్ధాశ్రమ నిర్వాహకులు రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. బాధితులను గొలుసులతో కట్టేసి.. వారికి నరకయాతన చూపిస్తున్నట్లు వెల్లడైంది. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.