నితిన్ పై మహానటి పగ… ఎందుకో తెలుసా… ఇన్ స్టాలో పోస్టు… గుణపాఠం నేర్చుకున్నానన్న కీర్తి సురేష్….

టాలీవుడ్ హీరో నితన్ మీద హీరోయిన్ కీర్తి సురేష్ పగ తీర్చుకుంటా అని అన్నారు. షూటింగ్ సమయంలో నిద్రపోకూడదనే గుణపాఠాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

నితిన్ పై మహానటి పగ... ఎందుకో తెలుసా... ఇన్ స్టాలో పోస్టు... గుణపాఠం నేర్చుకున్నానన్న కీర్తి సురేష్....
ఫ్రెండ్స్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ .
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 09, 2020 | 12:03 PM

టాలీవుడ్ హీరో నితన్ పై మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ పగ తీర్చుకుంటా అని అన్నారు. షూటింగ్ సమయంలో నిద్రపోకూడదనే గుణపాఠాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన నితిన్.. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు. ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయి‌లోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది.