కేసీఆర్, దీది బాటలో.. అమరీందర్ కూడా

సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి.. దీది, కేసీఆర్ బాటలో మరో ముఖ్యమంతి చేరాడు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరుకానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా.. ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నారు. ఇక ఈ ఇద్దరి సీఎంల బాటలోనే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా చేరారు. ఆయన కూడా […]

కేసీఆర్, దీది బాటలో.. అమరీందర్ కూడా
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2019 | 1:14 PM

సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి.. దీది, కేసీఆర్ బాటలో మరో ముఖ్యమంతి చేరాడు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరుకానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా.. ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నారు. ఇక ఈ ఇద్దరి సీఎంల బాటలోనే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా చేరారు. ఆయన కూడా సాయంత్రం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కారని తెలిసింది.