తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు.. కిటకిటలాడుతున్న ఆలయాలు..
తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే..
తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు తరలి వెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం, వరంగల్ భద్రకాళీ టెంపుల్, వేయి స్థంభాల గుడి, కొండగట్టు, బాసర, భద్రాద్రి రామాలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సహా పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిదేవుడి దర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరుతున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడి నామాన్ని స్మరించుకుంటున్నారు.
ఇక ప్రముఖ దివ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లలో సందడి నెలకొంది. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ ప్రాంగాణాన్ని శుభ్ర పరుస్తున్నారు. భక్తుల మధ్య సామాజిక దూరం ఉండేలా చూస్తున్నారు.