లోక కళ్యాణం కోసం సజీవ సమాధి…
ప్రపంచం బాగుండాలి అని కోరుకునే మనుషులు ఇంకా ఉన్నారా..?. కన్నవాళ్లని, అయినవాళ్లను కూడా కనీసం పట్టించుకోని రోజుల్లో..లోకం పచ్చగా ఉండాలని ఓ మహిళా సాధ్వి సజీవ సమాధిలో కూర్చున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో నుగ్గికేరి గ్రామానికి చెందిన సాధ్వికి కలలో దేవత కనిపించి లోకకళ్యాణం కోసం 21 రోజులు సజీవ సమాధి అవ్వాలని ఆదేశించారట. అసలే సాధ్వీ..ఆపై అమ్మవారి ఆఙ్ఞ..ఇంకేముంది వెంటనే సజీవ సమాధికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆమె. ఆ ఊర్లోని ఆదిశక్తి […]
ప్రపంచం బాగుండాలి అని కోరుకునే మనుషులు ఇంకా ఉన్నారా..?. కన్నవాళ్లని, అయినవాళ్లను కూడా కనీసం పట్టించుకోని రోజుల్లో..లోకం పచ్చగా ఉండాలని ఓ మహిళా సాధ్వి సజీవ సమాధిలో కూర్చున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో నుగ్గికేరి గ్రామానికి చెందిన సాధ్వికి కలలో దేవత కనిపించి లోకకళ్యాణం కోసం 21 రోజులు సజీవ సమాధి అవ్వాలని ఆదేశించారట. అసలే సాధ్వీ..ఆపై అమ్మవారి ఆఙ్ఞ..ఇంకేముంది వెంటనే సజీవ సమాధికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆమె. ఆ ఊర్లోని ఆదిశక్తి ఎల్లమ్మ ఆలమ్మ ఆలయ నిర్వాహకుల నుంచి సమాధి అయ్యేందుకు అనుమతి తీసుకుంది. 4 అడుగులు ఎత్తు, 4 అడుగులు వెడల్పుతో ..సమాధి నిర్మించారు. శ్వాస పీల్చుకోవడానికి మాత్రం సమాధి కింది భాగంలో ఓ చిన్న పైపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమె సమాధిలోనే ఉన్నారు.