కర్ణాటక మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్..
కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే కర్ణాటకలోని కోవిడ్ సోకిన మొదటి మంత్రి రవి కావటం గమనార్హం. ఆయనకి రెండు, మూడు రోజుల నుంచి అస్వస్థతగా ఉండటంతో.. ఆదివారం ఆయనతో పాటు కుటుంబానికి మొత్తం కరోనా టెస్టులు..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, పలువురు ప్రముఖ నటులు కూడా ఈ వైరస్ బారిన పడటంతో.. ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే కర్ణాటకలోని కోవిడ్ సోకిన మొదటి మంత్రి రవి కావటం గమనార్హం. ఆయనకి రెండు, మూడు రోజుల నుంచి అస్వస్థతగా ఉండటంతో.. ఆదివారం ఆయనతో పాటు కుటుంబానికి మొత్తం కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్లో రవికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
‘కరోనా వైరస్ సోకినట్టు మంత్రి సీటీ రవి ట్వీట్ చేశారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అదృష్టవశాత్తు నా భార్య పల్లవికి, మిగతా సిబ్బందికి నెగిటివ్ వచ్చిందని’.. ఆయన ట్వీట్లో వెల్లడించారు. అలాగే ‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్స తీసుకొని, తిరిగి ప్రజల కోసం పని చేస్తానని’ తెలిపారు. కాగా ఇప్పటికే కర్ణాటకలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ ముగ్గురు సిబ్బందికి కూడా కోవిడ్ సోకడంతో సీఎం యడియూరప్ప హోం క్వారంటైన్లో ఉంటున్నారు.
Yesterday, I along with my wife Pallavi & my staff members underwent COVID19 test. Fortunately, my wife Pallavi and all my staff members are tested Negative.
Third umpire’s result for me has confirmed that I’m Covid Positive. However, I’m feeling absolutely fine.
— C T Ravi ?? ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) July 13, 2020
Read More: బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ రిలీజ్..