కర్ణాటకలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1.72 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో..

కర్ణాటకలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 3:53 AM

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1.72 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 7,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,72,102కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 89,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 79,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 3,091 మంది మరణించారు.

ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు అర్బన్‌ నుంచే నమోదవుతున్నాయి. శుక్రవారం నమోదైన కేసుల్లో 2,665 కరోనా పాజిటివ్ కేసులు బెంగళూరు అర్బన్‌ నుంచే నమోదయ్యాయి.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు