కర్ణాటకలో కరోనా కల్లోలం.. కొత్తగా 6,128 కేసులు!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా
Coronavirus In Karnataka: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,128 కరోనా కేసులు నమోదు కాగా వైరస్ వల్ల 83 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,18,632కు చేరింది. సుమారు 69,700 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో 83 మంది చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 2,230కి చేరినట్లు పేర్కొంది.
Read More:
గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్ పోస్టుల భర్తీ!
జీహెచ్ఎంసీలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు.. గంటకు 500 పరీక్షలు..!