రోడ్లపైకి వచ్చేవారికి కర్ణాటక పోలీసుల ట్రీట్మెంట్ చూశారా..?
కరోనా ప్రస్తుతం ఎంత అల్లకల్లోలం క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి వైరస్ మరింత వ్యాప్తి చెందకుందా కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది. అయినా కొందరు ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు దండాలు పెట్టినా, గుంజీలు తీయించినా అసలు మాటవినడం లేదు. అందుకే కర్ణాటక ఖాకీలు వినూత్న పంథాలో పోకిరీలను నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చేవాళ్లను..కరోనా హెల్మెట్లు […]
కరోనా ప్రస్తుతం ఎంత అల్లకల్లోలం క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి వైరస్ మరింత వ్యాప్తి చెందకుందా కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది. అయినా కొందరు ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు దండాలు పెట్టినా, గుంజీలు తీయించినా అసలు మాటవినడం లేదు. అందుకే కర్ణాటక ఖాకీలు వినూత్న పంథాలో పోకిరీలను నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చేవాళ్లను..కరోనా హెల్మెట్లు పెట్టుకుని ఆపుతూ…బయటకు రాగానే కరోనా ఎదురై మరణాన్ని తీసుకొచ్చింది అనే విధంగా..గంట కొడుతూ, శంఖం ఊస్తూ.. వాహనదారుల్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.