బీజేపీకి జై కొట్టిన ఇద్దరు స్వతంత్రులు

కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో చిక్కుల్లో పడ్డ సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి అయిన హెచ్.నగేష్ కూడా షాకిచ్చారు. సోమవారం గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ సందర్భంగా ఆయన గవర్నర్‌తో మాట్లాడుతూ.. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే తన మద్దతు కమలం పార్టీకే ఉంటుందని నగేష్ స్పష్టం చేశారు. దీంతో […]

బీజేపీకి జై కొట్టిన ఇద్దరు స్వతంత్రులు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 1:03 PM

కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో చిక్కుల్లో పడ్డ సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి అయిన హెచ్.నగేష్ కూడా షాకిచ్చారు. సోమవారం గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ సందర్భంగా ఆయన గవర్నర్‌తో మాట్లాడుతూ.. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే తన మద్దతు కమలం పార్టీకే ఉంటుందని నగేష్ స్పష్టం చేశారు. దీంతో కుమారస్వామి శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే బీజేపీకి జై కొట్టినట్టు ఈ పరిణామంతో తేలిపోయింది.

కాగా, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి ఆర్. శంకర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన… సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే.. మద్దతు తెలుపుతానంటూ స్పష్టంచేశారు.