‘కేజీఎఫ్’ హీరో అయ్యాడండీ ‘స్వామి’కి టార్గెట్

కేజీఎఫ్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్‌వుడ్ నటుడు యశ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకెళ్లవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక తాను ఒప్పుకుంటానన్న నమ్మకం లేదని కుమారస్వామి అన్నారు. అయితే మాండ్యాలో జరిగే ఉప ఎన్నికల్లో దివంగత నటుడు అంబరీశ్ సతీమణి నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆమెకు ప్రత్యర్థిగా ముఖ్యమంత్రి కుమార […]

‘కేజీఎఫ్’ హీరో అయ్యాడండీ ‘స్వామి’కి టార్గెట్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 18, 2019 | 2:37 PM

కేజీఎఫ్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్‌వుడ్ నటుడు యశ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకెళ్లవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక తాను ఒప్పుకుంటానన్న నమ్మకం లేదని కుమారస్వామి అన్నారు.

అయితే మాండ్యాలో జరిగే ఉప ఎన్నికల్లో దివంగత నటుడు అంబరీశ్ సతీమణి నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆమెకు ప్రత్యర్థిగా ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్న నేపథ్యంలో.. సుమలతకు మద్దతుగా యశ్ రంగంలోకి దిగి ప్రచారం ప్రారంభించాడు. ఈ సందర్భంలో జేడీఎస్‌పై విమర్శలు కురిపించడంతో ఆ పార్టీ నేత, సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ‘‘మాలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి జీవితాలు ముందుకెళ్లవు. అలాంటి నటులు తన పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు. తాను నివారిస్తున్నాను కాబట్టే తమ పార్టీ కార్యకర్తలు అతడిపై ఏ కామెంట్ చేయకుండా మౌనంగా ఉన్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

కాగా ఆయన మాటల్ని బట్టి చూస్తే యశ్‌కు నిర్మాతలెవరూ అవకాశాలివ్వొద్దని పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లేనని వార్తలు వస్తున్నాయి. ఓ వైపు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన యశ్, శాండిల్‌వుడ్‌లో టాప్ హీరోగా ఎదగడం.. తన కుమారుడు నిఖిల్ హీరోగా అట్టర్ ఫ్లాప్ కావడం లాంటి విషయాలను మనసులో పెట్టుకునే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారని శాండిల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.