క‌రీంన‌గ‌ర్‌లో క‌రోనా తొలి పాజిటివ్ కేసు…

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రెండోద‌శ‌లోకి చేరుతోంది. రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా రెండో కేసు నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకుల బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ...

క‌రీంన‌గ‌ర్‌లో క‌రోనా తొలి పాజిటివ్ కేసు...
Follow us

|

Updated on: Mar 23, 2020 | 1:06 PM

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రెండోద‌శ‌లోకి చేరుతోంది. రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా రెండో కేసు నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకుల బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ అంతా హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డ ఇండోనేసియా బృందాన్ని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అంద‌జేస్తున్న‌ సంగతి తెలిసిందే. తాజాగా కరోనా పేషెంట్లను కలిసిన కరీంనగర్ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. స్థానికుల్లో మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది.

ఇండోనేషియా నుంచి వ‌చ్చిన మత ప్రచారకులకు కరోనా వైరస్ ఉండటం వల్లే కరీంనగర్ వ్యక్తికి కూడా సోకిందని కలెక్టర్ శ‌శాంక్ తెలిపారు. విష‌యం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ ప‌రిస్థితిపై ఆరా తీశారు. కలెక్టర్‌, అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలో పర్యవేక్షిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హుటాహుటిన కరీంనగర్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్ర‌జ‌లెవ‌రూ రోడ్ల‌పైకి రావొద్ద‌ని హెచ్చ‌రించారు. కరోనా సోకిన కరీంనగర్ వ్యక్తితో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారో వారి వివరాలు కూడా తెలుసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు.

పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ఎవరైతే తిరిగారో.. వాళ్లు వెంటనే ఆస్పత్రికి వచ్చి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.. అంతేకాకుండా.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కరీంనగర్‌లో ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని గుర్తించారు. అలా అయితే కోచింగ్ సెంటర్‌కు వచ్చే విద్యార్థులను కూడా కరోనా టెస్టు చేయాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే అప్రత్తమైన పారిశుద్ద్య యంత్రాంగం.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి 3 కిలోమీటర్ల చుట్టుపక్కల రోడ్లపై స్ప్రె చేశారు.. కరీంనగర్‌లో ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించాలని.. ఎవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని కలెక్టర్ శశాంక కోరారు. కరోనా పేషెంట్లను కలిసిన వారికి కరోనా సోకడం.. వారి ద్వారా మరొకరికి సోకడం లాంటివి జరిగితే కరోనాను అరికట్టడం కష్టం అవుతుంది. ఈ కేసుతో తెలంగాణలో మొత్తం కేసులు 28కి చేరాయి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!