వికాస్ దూబే కేసు…కోడలితో సహా ఇద్దరి అరెస్ట్

యూపీలో హిస్టరీ షీటర్, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసులో కాన్పూర్ పోలీసులు అతని కోడలిని, అతని ఇంటి పొరుగునున్న వ్యక్తిని, పనిమనిషిని అరెస్టు చేశారు. వారిని షమ, సురేష్ వర్మ, రేఖగా గుర్తించారు. గత శుక్రవారం వికాస్ దూబే పరారీలో..

వికాస్ దూబే కేసు...కోడలితో సహా ఇద్దరి అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 07, 2020 | 11:44 AM

యూపీలో హిస్టరీ షీటర్, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసులో కాన్పూర్ పోలీసులు అతని కోడలిని, అతని ఇంటి పొరుగునున్న వ్యక్తిని, పనిమనిషిని అరెస్టు చేశారు. వారిని షమ, సురేష్ వర్మ, రేఖగా గుర్తించారు. గత శుక్రవారం వికాస్ దూబే పరారీలో వీరి హస్తం ఉన్నట్టు భావిస్తున్నారు. బిక్రు గ్రామంలో ఆ రోజు వికాస్ సహచరులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. వికాస్ పారిపోవడానికి ఈ ముగ్గురూ సహాయపడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దూబే సహచరులు కాల్పులు జరుపుతుండగా.. తనను తాను రక్షించుకునేందుకు ఓ పోలీసు వీరి ఇంటి తలుపు తట్టగా, వికాస్ కోడలు షమ తలుపు తీయలేదని తెలిసింది. వికాస్ ను పట్టిచ్చిన వారికి పోలీసులు రెండున్నర లక్షల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు-దూబే సహచరుల కాల్పుల్లో మృతి చెందిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా కుమార్తె వైష్ణవి మిశ్రా.. దూబేవంటివారిపని పట్టేందుకు పోలీసు శాఖలో ఉద్యోగం చేయాలనుకుంటోంది. మొదట డాక్టర్ కావాలనుకున్న ఆమె… తన తండ్రి మృతితో తన నిర్ణయాన్ని మార్చుకుంది.