‘గెటౌట్ ప్రశాంత్ నీల్’.. ‘కేజీఎఫ్ 2’ దర్శకుడిపై ట్వీట్లు.. ఎందుకంటే..!
'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ను సంపాదించుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యశ్తో 'కేజీఎఫ్ 2' తెరకెక్కిస్తున్నారు
‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ను సంపాదించుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యశ్తో ‘కేజీఎఫ్ 2’ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ను ఆయన డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో విష్ చేశారు. న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో ఫైనల్గా నాకు తెలిసింది. ఇంకోసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు రేడియేషన్ షూట్ తెచ్చుకుంటాను అంటూ ఎన్టీఆర్పై ప్రశాంత్ ప్రశంసలు కురిపించారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా కన్ఫర్మ్ అయినట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో ఆయనపై కన్నడ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. గెటౌట్ అంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
దర్శకుడిగా ప్రశాంత్ నీల్కి కన్నడ సినీ పరిశ్రమ గుర్తింపును ఇస్తే.. ఇప్పుడు కన్నడ సినిమాను వాడుకొని వెళ్లిపోతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రష్మిక మందన్నతో ప్రశాంత్ని పోలుస్తున్నారు. కన్నడ సినిమాలో గుర్తింపు తెచ్చుకొని, అధిక పారితోషకాలను ఆశపడి.. శాండిల్వుడ్ను వదిలి వెళ్తున్నారని వారు ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో గెటౌట్ ప్రశాంత్ నీల్ హ్యాష్ట్యాగ్తో ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మరోవైపు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం వెల్కం టు టాలీవుడ్ ప్రశాంత్ నీల్ అనే హ్యాష్ట్యాగ్తో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. కాగా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్తో మైత్రీ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నట్లు టాక్.
Read This Story Also: ఆ బడా నిర్మాత ఇంట్లో మరో ఇద్దరికి కరోనా..!