దోచుకునేందుకే రాజధాని మార్పు: కన్నా

అమరావతి ప్రాంత రైతులు బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ, బీజేపీ మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు […]

దోచుకునేందుకే రాజధాని మార్పు: కన్నా
Follow us

| Edited By:

Updated on: Feb 12, 2020 | 1:12 PM

అమరావతి ప్రాంత రైతులు బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ, బీజేపీ మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని విమర్శించారు.

అధికార వికేంద్రీకరణ క్రమంలో మూడు రాజధానుల ఏర్పాటుపై కన్నా తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఉండలేమని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ప్రజలు కూడా విశాఖలో రాజధాని వద్దంటున్నారని కన్నా వివరించారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్‌, పెట్రో ఛార్జీలు పెంచి… ప్రజల రక్తం పీల్చేలా వైకాపా పాలన కొనసాగుతోందని విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!