చంద్రబాబు పాలనలో అంతా అవినీతే- కన్నా
నర్సారావుపేట: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి బీజేపీ కారణమన్న.. ఆయన ప్రభుత్వం మొత్తం అవినీతితో నిండిపోయిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు తప్ప సాధారణ ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నర్సారావుపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కోడెల, కోడెల కొడుకు, కోడెల కూతురు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాతో అధికార పార్టీ నాయకులు కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. […]
నర్సారావుపేట: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి బీజేపీ కారణమన్న.. ఆయన ప్రభుత్వం మొత్తం అవినీతితో నిండిపోయిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు తప్ప సాధారణ ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నర్సారావుపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కోడెల, కోడెల కొడుకు, కోడెల కూతురు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాతో అధికార పార్టీ నాయకులు కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. మోడీ అభివృద్ధిని చూపి ఓట్లు అడుగుతుంటే.. చంద్రబాబు తాను జైలుకి వెళ్లకుండా ఉండేందుకు మీరే గెలిపించాలని ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.