హైదరాబాద్కు కంగనా !
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానస్పద మరణం నాటినుంచి ఆమె బాలీవుడ్ లోని నెపోటిజంపై తీవ్ర విమర్శలు చేసింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానస్పద మరణం నాటినుంచి ఆమె బాలీవుడ్ లోని నెపోటిజంపై తీవ్ర విమర్శలు చేసింది. అంతటితో ఆగకుండా బాలీవుడ్లో డ్రగ్స్ కోణంపై, పలువురు నాయకులపై, మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చి చర్చనీయాంశమైంది. కోవిడ్ కారణంగా దాదాపు 7నెలల నుంచి షూటింగుకు దూరంగా ఉన్న ఈ బాలీవుడ్ స్టార్ నటి.. మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు గురువారం ఉదయం దిగిన ఫొటోలతో ఆమె ట్విట్ చేసింది.
Dear friends today is a very special day, resuming work after 7 months, travelling to southern India for my most ambitious bilingual project THALAIVI, need your blessings in these testing times of a pandemic. P.S just clicked these morning selfies hope you all like them ❤️ pic.twitter.com/drptQUzvXK
— Kangana Ranaut (@KanganaTeam) October 1, 2020
‘‘ప్రియమైన మిత్రులారా, ఈ రోజు చాలా స్పెషల్.. దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నాను. నా ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్రం తలైవి కోసం సౌత్ ఇండియా వెళ్తున్నాను.. ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నాకు మీ ఆశీర్వాదం కావాలి’’ అని కంగనా పేర్కొంది.
కాగా కంగనా హైదరాబాద్కు రానున్నట్లు సమాచారం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.
Also Read :