Kangana Ranaut: క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన బాలీవుడ్ క్వీన్.. ‘మణికర్ణిక’ సీక్వెల్గా ‘ది లెజెండ్ ఆఫ్ దిద్దా’
Kangana Ranaut: వివాదాలతో సంచలనాలు సృష్టించే బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ కొత్త సంవత్సరంలో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.
Kangana Ranaut: వివాదాలతో సంచలనాలు సృష్టించే బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ కొత్త సంవత్సరంలో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. 2019లో ఆమె వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి పాత్రలో ఒదిగిపోయి అదరగొట్టిన ‘మణికర్ణిక’ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసింది. ‘ది లెజెండ్ ఆఫ్ దిద్దా’ పేరుతో భారీ బడ్జెట్తో సీక్వెల్ను తీసుకువస్తున్నారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ‘మణికర్ణిక’ నిర్మాత కమల్జైన్ సీక్వెల్ని కూడా నిర్మించనున్నారు.
ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా యోధురాలైన కశ్మీర్ రాణిగా కనిపించనుందని సమాచారం. ఒక కాలు పోలియో బారిన పడినప్పటికీ ఆమె గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడిస్తుంది. ఇలా మరోసారి మహిళా యోధురాలిగా మెప్పించేందుకు కంగనా సిద్ధమైంది. ఆమె నటించిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ‘తేజస్’లో నటిస్తోంది.
Missing Boy Died: అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి.. మురుగు కాలువలో బాలుడి మృతదేహం..