నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం12:45 నిమిషాలకు కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితతో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప […]
ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం12:45 నిమిషాలకు కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితతో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కనీసం డిపాజిట్ కూడా ప్రతిపక్ష పార్టీలు దక్కించుకోలేకపోయాయి. ఉప పోరులో 672 ఓట్ల మెజార్టీతో కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు లోక్సభ సభ్యురాలిగా నిజామాబాద్ నుంచి కవిత ప్రాతినిధ్యం వహించిన విషయం విదితమే. ఇప్పటికే కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, ఆమె హోం క్వారంటైన్ లోకి వెళ్లడంతో ఈ కార్యక్రమం కాస్త ఆలస్యమై ఇవాళ జరుగుతోంది.