సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. పోలీస్కే టోకరా..!
ఏదైనా సమస్య వస్తే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ ఆ పోలీసులకే సమస్య వస్తే...ఏంటి పరిస్థితి. కడప జిల్లాలో ఇదే జరిగింది. రాజంపేటకు చెందిన కానిస్టేబుల్ ఆన్లైన్ ట్రేడింగ్లో 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి... నిండా మునిగాడు.
ఏదైనా సమస్య వస్తే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ ఆ పోలీసులకే సమస్య వస్తే…ఏంటి పరిస్థితి. కడప జిల్లాలో ఇదే జరిగింది. రాజంపేటకు చెందిన కానిస్టేబుల్ ఈశ్వర్రెడ్డి- ఆన్లైన్ ట్రేడింగ్లో 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి… నిండా మునిగాడు. దీంతో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ ఈశ్వర్ రెడ్డి ఆర్నెళ్ల నుంచి జేఎస్ క్లబ్, యోకో క్లబ్ల ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ జరిపాడు. అయితే – కొంతకాలం ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగాయి. కానిస్టేబుల్కు మాయ మాటలు చెప్పి 25 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. ఇంకేముంది… క్లబ్ల నుంచి నో రెస్పాన్స్. మోసపోయానని తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ – గత నెల9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కానీ అప్పటికే… ఓ ఫిర్యాదు మేరకు ఆ రెండు క్లబ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. చైనాకు చెందిన యాన్కో, హర్యానాకు చెందిన ధీరజ్ సర్కార్, అంకిత్కపూర్లను జైల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న రాజంపేట పోలీసులు – పీటీ వారెంట్పై వారిని నందలూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రొద్దుటూరు సబ్జైలుకు తరలించారు. మోసాలకు పాల్పడ్డ ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలను హోల్డ్లో పెట్టారని పోలీసులు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.