తెరపైకి కేఏ పాల్ బయోపిక్.. హీరో ఎవరంటే!
ఏపీ ఎన్నికల తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన హంగామా గురించి అందరికి తెలిసిందే. మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల వేడిని ఎక్కువ చేస్తే.. పాల్ మాత్రం తనదైన శైలి మాటలు, చేష్టలతో జనాన్ని ఎంటర్టైన్ చేశారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కేఏ పాల్ మళ్ళీ కనిపించలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన మీద సినిమా తెరకెక్కించడానికి కొంతమంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి. తాజా సమాచారం ప్రకారం కేఏ పాల్ బయోపిక్ ను రూపొందించేందుకు […]
ఏపీ ఎన్నికల తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన హంగామా గురించి అందరికి తెలిసిందే. మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల వేడిని ఎక్కువ చేస్తే.. పాల్ మాత్రం తనదైన శైలి మాటలు, చేష్టలతో జనాన్ని ఎంటర్టైన్ చేశారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కేఏ పాల్ మళ్ళీ కనిపించలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన మీద సినిమా తెరకెక్కించడానికి కొంతమంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి.
తాజా సమాచారం ప్రకారం కేఏ పాల్ బయోపిక్ ను రూపొందించేందుకు ఓ నూతన దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడట. ఇందులో పాల్ పాత్రను ప్రముఖ నటుడు సునీల్ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.