‘ఆత్మీయుడయ్యాడు’.. సింధియాతో అమిత్ షా

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా గురువారం హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు. మొదట రాజ్ నాథ్ సింగ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసిన సింధియా..

'ఆత్మీయుడయ్యాడు'.. సింధియాతో అమిత్ షా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 12, 2020 | 1:16 PM

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా గురువారం హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు. మొదట రాజ్ నాథ్ సింగ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసిన సింధియా.. ఆ తరువాత షా నివాసానికి వెళ్లి ఆయనతో కూడా సమావేశమయ్యారు. సింధియాను కలిసిన ఫోటోను అమిత్ షా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘సింధియా రాక మధ్యప్రదేశ్ లో ప్రజలకు సేవ చేయాలన్న బీజేపీ ధ్యేయాన్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని పేర్కొన్నారు. . అటు-రాజ్ నాథ్ సింగ్ కూడా.. సింధియా తమ పార్టీలో చేరికతో పార్టీ మరింత పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సింధియా తన లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మధ్యప్రదేశ్ నుంచి సింధియాను బీజేపీ రాజ్యసభకు పంపనుంది.

కాగా-జ్యోతిరాదిత్య సింధియా ఇలా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతుండగా అటు-బెంగుళూరులో ఆయన మద్దతుదారులైన ఆరుగురు మంత్రులతో సహా మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి.. తమ భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. సింధియా వెంటే తామూ అని పేర్కొని వీడియోలు కూడా రిలీజ్ చేసిన వీరు.. సింధియా నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. .