Jyoti Kumari: మరోసారి వార్తల్లోకెక్కిన సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి.. నాటి సాహసానికి నేడు గుర్తింపునిచ్చిన బిహార్ ప్రభుత్వం..
Jyoti Kumari: మీకు జ్యోతి కుమారి తెలుసా? ఏ జ్యోతి కుమారి అంటారా? అలాగే అంటారులేండి.. ఉత్త జ్యోతి కుమారి అని చెబితే మీరెలా గుర్తుపడతారు.
Jyoti Kumari: మీకు జ్యోతి కుమారి తెలుసా? ఏ జ్యోతి కుమారి అంటారా? అలాగే అంటారులేండి.. ఉత్త జ్యోతి కుమారి అని చెబితే మీరెలా గుర్తుపడతారు. పోనీ సైకిల్ జ్యోతి కుమారి గుర్తుందా? హా.. ఇప్పుడు పక్కా గుర్తొచ్చి ఉంటది. కరోనా కష్ట కాలంలో అనారోగ్యం బారిన పడిన తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సంచలనం సృష్టించింది 15 ఏళ్ల జ్యోతి. బతుకుదెరువు కోసం హర్యానాకు వెళ్లగా.. కరోనా వారి బతుకులను చిన్నాబిన్నం చేసింది. దాంతో జ్యోతి కుమారి తన తండ్రిని సైకిల్పై ఎక్కించుకుని హర్యానాలోని గురుగ్రామ్ నుంచి ఏడురోజుల పాటు ప్రయాణించి బిహార్లోని స్వస్థలానికి చేరుకుంది. మరి అలాంటి జ్యోతిని అంత త్వరగా ఎలా మరిచిపోతాం. అయితే తాజాగా మరోసారి జ్యోతి వార్తల్లో టాప్గా నిలిచింది.
ఈ సారి బిహార్ ప్రభుత్వం ఆమెకు అరుదైన గుర్తింపునిచ్చింది. ‘కంప్లీట్ స్టాప్ అన్ డ్రగ్స్’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా జ్యోతిని నియమిస్తూ బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ సెక్యూరిటీ డైరెక్టర్ దయానిధన్ పాండే ధృవీకరించారు. ఈ సందర్భంగా జ్యోతిని ఘనంగా సన్మించారు. దాంతో పాటు.. ఆమెకు రూ. 50వేల చెక్కును ఒక ట్యాబ్ను ప్రదానం చేశారు. జ్యోతి ఎంతో సహసి అని కితాబిచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చొబెట్టుకుని స్వగ్రామం వరకు తీసుకువచ్చిన ధీర వనిత అని కీర్తించారు. ఆ కారణంగానే ఆమె సాహసాన్ని గుర్తించి.. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు ఆయన తెలిపారు. జ్యోతి యువతరానికి స్ఫూర్తిగా నిలిస్తుందని అన్నారు.
Also read: