అక్కచెల్లెమ్మల కోసం బరిలోకి దిగిన ‘రాఖీ’.. ఆన్ లైన్ మోసాలపట్ల అవగాహన కల్పిస్తున్న తారక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తారక్ దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తారక్ దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాలో గిరిజన వీరుడు కొమరం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా మరో సారి బాధ్యతను తీసుకున్నారు. ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టేలా పోలీసులు ప్రజల్లో అవగాహనా కల్పించనున్నారు.
చెల్లెమ్మా నీకే చెప్తున్నా.. నా మాట విను.. ఫేస్బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ పోలీసులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బురిడీ కొట్టించి, ఫోన్ నెంబరు తీసుకుని, ప్రేమ పేరుతో అభ్యంతరకర ఫోటోలు వాట్సాప్ లలో తెప్పించుకుని కొన్ని ముఠాలు బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నాయి. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు రూపొందించిన వీడియోను తారక్ ప్రమోట్ చేశారు. ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా బాధితులుగా మారితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి :
Radhe Shyam movie : ఎంత వెయిట్ చేస్తే అంత కిక్.. రాధేశ్యామ్ టీజర్పై డైరెక్టర్ క్రేజీ కామెంట్