ఈనెల 20 నుంచి బీటెక్ ఎగ్జామ్స్..పలు కీలక నిర్ణయాలు..!
జేఎన్టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో జూన్ 20 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి . కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వర్సిటీ ఈసారి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
జేఎన్టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో జూన్ 20 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి . కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వర్సిటీ ఈసారి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. చదివిన కళాశాలల్లోనే ఎగ్జామ్స్ కండెక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. క్వచ్చన్ పేపరులోనూ మార్పులు చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్గదర్శకాలను విడుదల చేశారు. బీటెక్ ప్రశ్నాపత్రంలో పార్టు-ఏ, పార్టు-బీ విధానాన్ని తీసివేసి.. మొత్తం ఒకే విభాగంలో ప్రశ్నలు రూపొందించామని వివరించారు. ప్రతి క్వచ్చన్ పేపర్ లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఐదింటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయాన్ని కూడా 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించినట్టు గోవర్ధన్ వివరించారు.
అన్ని ఎగ్జామ్ సెంటర్స్ లో ఐసీఎంఆర్ సూచించిన నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. స్టూడెంట్లకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జామ్ సెంటర్లను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు.