ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణం..
ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న సీజే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఏపీ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ […]
ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న సీజే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఏపీ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవరిస్తున్నారు. గత 9 నెలలుగా ఏసీజేగా ఆయన విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి సీజే నియామకంతో జస్టిస్ ప్రవీణ్కుమార్ సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు.
జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న మధ్యప్రదేశ్లో జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా వృత్తిలో అడుగుపెట్టారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.