మద్యం మత్తులో పూజారి దారుణ హత్య..!

మంచిమాట చెప్పబోయి ఓ పూజారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దేవుడి గుడిలో మద్యం తాగొద్దని చెప్పిన ఆ పూజారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్  రాష్ట్రంలో జరిగింది. విష్ణుపురా ప్రాంతంలోని ఓ గ్రామంలో సుందర్ భుయా పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే కొందరు ఆకతాయిలు ఆలయంలో మద్యం తాగేందుకు ప్రయత్నించారు. ఆలయంలో ఇలాంటి పనులు చేయోద్దని చెప్పడంతో.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు భుయాతో వాగ్వాదానికి దిగారు. కత్తితో ఆయన పై దాడి […]

మద్యం మత్తులో పూజారి దారుణ హత్య..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 17, 2019 | 6:54 PM

మంచిమాట చెప్పబోయి ఓ పూజారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దేవుడి గుడిలో మద్యం తాగొద్దని చెప్పిన ఆ పూజారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్  రాష్ట్రంలో జరిగింది. విష్ణుపురా ప్రాంతంలోని ఓ గ్రామంలో సుందర్ భుయా పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే కొందరు ఆకతాయిలు ఆలయంలో మద్యం తాగేందుకు ప్రయత్నించారు. ఆలయంలో ఇలాంటి పనులు చేయోద్దని చెప్పడంతో.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు భుయాతో వాగ్వాదానికి దిగారు. కత్తితో ఆయన పై దాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయారు. మరుసటిరోజు ఆలయానికి వచ్చిన భక్తులు పూజారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే తీవ్రగాయాల పాలైన పూజారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.