ప్రమాణ స్వీకారానికి ముందే ప్రకంపనలు!
ప్రధానమంత్రిగా రెండవసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోయే గంట ముందు ఎన్డీయేలో కీలక పక్షం అయిన జేడీయూ.. బీజేపీకి షాక్ ఇచ్చింది. తాము మంత్రి వర్గంలో చేరబోవడం లేదంటూ తేల్చి చెప్పింది. దీంతో ఆదిలోనే ఎన్డీయేలో కలవరం మొదలైంది. బీజేపీతో కలిసి బిహార్లో స్వీప్ చేసిన జేడీయూ సొంతంగా 16 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయితే మంత్రి వర్గంలో ఒక క్యాబినేట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇవ్వచూపడంపై పార్టీ అధినేత నితీశ్ కుమార్ కినుక వహించినట్లు […]
ప్రధానమంత్రిగా రెండవసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోయే గంట ముందు ఎన్డీయేలో కీలక పక్షం అయిన జేడీయూ.. బీజేపీకి షాక్ ఇచ్చింది. తాము మంత్రి వర్గంలో చేరబోవడం లేదంటూ తేల్చి చెప్పింది. దీంతో ఆదిలోనే ఎన్డీయేలో కలవరం మొదలైంది. బీజేపీతో కలిసి బిహార్లో స్వీప్ చేసిన జేడీయూ సొంతంగా 16 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయితే మంత్రి వర్గంలో ఒక క్యాబినేట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇవ్వచూపడంపై పార్టీ అధినేత నితీశ్ కుమార్ కినుక వహించినట్లు సమాచారం. మరో మంత్రి పదవి కూడా ఇవ్వాలని జేడీయూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనికి బీజేపీ అధిష్టానం ససేమిరా అన్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేళ జరిగిన ఈ పరిణామం ఎన్డీయేలో ప్రకంపనలు రేపుతోంది. అయితే మంత్రివర్గంలో చేరకపోయినప్పటికీ ఎన్డీయేలోనే కొనసాగుతామని నితీష్ కుమార్ స్పష్టంచేశారు.
Bihar CM Nitish Kumar: They wanted only 1 person from JDU in the cabinet, so it would have been just a symbolic participation.We informed them that it is ok we don't need it. It is not a big issue, we are fully in NDA and not upset at all.We are working together,no confusion. pic.twitter.com/AsDa8EUnUN
— ANI (@ANI) May 30, 2019