జేడీఎస్ ఎమ్మెల్యే కన్నుమూత
కర్ణాటక రాష్ట్రానికి చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే బీ సత్యనారాయణ మృతి చెందారు. ఆయన తుముకురు జిల్లాలోని సిరా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు..
కర్ణాటక రాష్ట్రానికి చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే బీ సత్యనారాయణ మృతి చెందారు. ఆయన తుముకురు జిల్లాలోని సిరా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. మనిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. అతని వయస్సు 69 ఏళ్లు. సత్యనారాయణకు ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. జేడీఎస్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. గతంలో కేఎస్ఆర్టీసీకి చైర్మన్గా కూడా వ్యవహరించారు. సత్యనారాయణ మృతిపట్ల జేడీఎస్ అధినేత దేవేగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ కూడా సత్యనారాయణ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
B Sathyanarayana, Janata Dal (Secular) MLA from Sira Constituency, Karnataka who was under treatment at Manipal hospital for a prolonged illness passed away today. He was 69: Manish Rai, Hospital Director
— ANI (@ANI) August 4, 2020
Read More :
మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు
కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్ కన్నింగ్ వేషాలు