Breaking : మరోసారి పోలీస్ కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. సీఐపై దురుసుగా వ్యవహరించిన కేసులో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. సీఐపై దురుసుగా వ్యవహరించిన కేసులో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపేందుకు జేసీని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. ఈ క్రమంలో ఒకరోజు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఆదివారం జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జైల్లో ఉన్నారు.
Also Read : రమేష్ ఆస్పత్రికి భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్